Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2022: Apply for 5008 Junior Associate Posts – Details Here

 

SBI Recruitment 2022: Apply for 5008 Junior Associate Posts – Details Here

ఎస్బీఐలో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులు  - పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 03-01-2023

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

=======================

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్ లో 225 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు: జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)

మొత్తం పోస్టుల సంఖ్య: 5008.

సర్కిల్ వారీగా ఖాళీలు:

అహ్మదాబాద్- 357

బెంగళూరు- 316

భోపాల్- 481

బెంగాల్- 376

భువనేశ్వర్- 170

చండీగఢ్- 225

చెన్నై- 362

దిల్లీ- 152

హైదరాబాద్- 225

జైపూర్ - 284

కేరళ- 273

లఖ్నవూ/దిల్లీ - 631

మహారాష్ట్ర/ముంబయి మెట్రో- 747

మహారాష్ట్ర- 50

నార్త్ ఈస్టర్న్- 359

విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.08.2022 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1994 - 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

బేసిక్ పే: నెలకు రూ.19900.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది.

మెయిన్ ఎగ్జామ్: మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.09.2022.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.09.2022.

ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2022లో జరుగుతుంది.

మెయిన్ పరీక్ష తేది: డిసెంబర్ 20221 / జనవరి 2023లో జరుగుతుంది.

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags