Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET: Update on Inter Weightage in EAMCET Ranks

 

TS EAMCET: Update on Inter Weightage in EAMCET Ranks

తెలంగాణ ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం?  

=====================

తెలంగాణ ఎంసెట్ లో  ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలో జీవో వెలువడనుంది. ప్రస్తుతానికి ఈ ఏడాదికి ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించినా శాశ్వతంగా తొలగిస్తూ జీవో జారీ చేయనుందని తెలిసింది. ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్ లోని  భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును నిర్ణయిస్తున్నారు. కరోనా కారణంగా 2020, 2021, 2022 ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించారు. ఈ ఎంసెట్ నుంచి ఇంటర్ మార్కులకు వెయిటేజీ శాశ్వతంగా ఉండదు. ప్రవేశ పరీక్షలో.. తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, చివరగా రసాయన శాస్త్రంలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. కొద్ది సంవత్సరాలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఒకటికి మించి ఎక్కువ ప్రశ్నపత్రాలు ఉండడంతో మార్కులు కాకుండా పర్సంటైల్ ని  లెక్కిస్తున్నారు. పర్సంటైల్ కూడా ఒకటే వస్తే జన్మదినాన్ని పరిగణనలోకి తీసుకొని ఎవరు పెద్దవారైతే వారికి మెరుగైన ర్యాంకును కేటాయిస్తారు.

=====================

ఇప్పటివరకు ర్యాంకింగ్ విధానం ఇదే

ఉదాహరణకు ఎంసెట్ లో 160కి 80 మార్కులు వస్తే 75 శాతం లెక్కన 37.5 మార్కులు వచ్చినట్లుగా పరిగణిస్తారు. (80/160x75=37.5).

ఇంటర్ లో  600 మార్కులకు 576 సాధిస్తే 25 శాతానికి కుదించినప్పుడు 24 మార్కులు వచ్చినట్లు లెక్క. (576/600×25=24)

=====================

కారణం ఇదే .....

జేఈఈ మెయిన్, నీట్ లో  ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించారు. జేఈఈ మెయిన్ కు రాష్ట్రం నుంచి 90 వేల మంది వరకు హాజరవుతున్నారు. ఎంసెట్ కు  1.70 లక్షల మంది వరకు ఉంటున్నారు. అంటే ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేకున్నా జేఈఈ మెయిన్ కు  పోటీపడుతున్నారు. బట్టీ పట్టిన వారికి ఇంటర్ మార్కులు అధికంగా వస్తున్నాయి. ఇంటర్లో 850, 900 మార్కులు దాటిన వారిలో కొందరు ఎంసెట్ లో  కనీస మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి సబ్జెక్టు పరిజ్ఞానం ఉండటం లేదని అధికారులు భావిస్తున్నారు. ఎంసెట్ కు  సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఆర్జీయూకేటీ, ఓపెన్ స్కూల్ తదితర బోర్డుల విద్యార్థులు హాజరవుతారు. వాటి ఫలితాలు వెలువడకుంటే ఎంసెట్ ర్యాంకులను విడుదల చేయడం కుదరదు. ఈ నేపథ్యంలోనే ఎంసెట్ మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించాలన్న నిర్ణయానికి వస్తున్నారు.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags