Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Final Semester Exams is Mandatory

చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాయడం తప్పనిసరని తేల్చి చెప్పిన కేంద్రం


విశ్వవిద్యాలయాల్లో చివరి సెమిస్టర్‌ పరీక్షలు తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నాయి.  రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉద్ఘాటించింది.         
విద్యా సంవత్సరంలో విద్యార్థి ఎంతమేర నేర్చుకున్నాడనే విషయమై మూల్యాంకనం చేయడం అనేది.. విశ్వసనీయత, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన అంశమని స్పష్టంచేసింది. ఈ మేరకు మార్గదర్శకాల్లో సవరణలు సైతం చేసింది. ఆరు రాష్ట్రాల అభ్యంతరాలపై హెచ్చార్డీ శాఖ అధికారి ఒకరు స్పందించారు.  మొత్తంగా పరీక్షలు ఉండకపోవడం అనేది సాధ్యమయ్యే పనికాదని విద్యార్థుల ఉన్నత చదువులు, భవిష్యత్తు ఉద్యో గ అవకాశాల దృష్ట్యా ఫైనలియర్‌ పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రాలు తమకు వీలైన సమయంలోనే ఈ పరీక్షలు నిర్వహించవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌ విధానంలోనూ పరీక్షలు రాసే అవకాశం ఉందని గుర్తుచేశారు. వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆఖరి సెమిస్టర్‌ పరీక్షలను జులైలో నిర్వహించాలని గతంలో సూచించిన యూజీసీ.. వాటిని సెప్టెంబరులోపు జరపాలని గతవారం మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags