Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

High Court comments on degree and PG exams‌ - Clarity is likely to come today



High Court comments on degree and PG exams‌ - Clarity is likely to come today 
TS: డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు‌.  నేడు స్పష్టత వచ్చే అవకాశం..!
డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇదే అంశంపై హైకోర్టులో విచారణ ముగిసింది.
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇదే అంశంపై నిన్న హైకోర్టులో విచారణ ముగిసింది. చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఎన్ఎస్‌యూఐ, ఇతర పిటిషనర్లు కోరారు. అయితే ఆన్‌లైన్‌లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలు కాదన్న ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమస్య తలెత్తుతుందని కోర్టుకు తెలిపింది. పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చని.. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనప్పటికీ రెగ్యులర్‌గానే పరిగణిస్తామని పేర్కొంది.

అటానమస్ కాలేజీలకు మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు స్వేచ్ఛ ఇచ్చామన్న ప్రభుత్వం.. ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చింది. క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ కోర్టుకు వివరించింది. మిడ్‌టర్మ్ పరీక్షలు ఆన్‌లైన్‌లో.. సెమిస్టర్ ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని జేఎన్‌టీయూహెచ్ పేర్కొంది.

అయితే దీనికి ప్రతిగా కోర్టు స్పందిస్తూ.. ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోందని.. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ ఏదో ఒకే విధానం ఉండాలని హైకోర్టు అభిప్రాయ పడింది. ఈ మేరకు స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు నేటికీ వాయిదా వేసింది. ఈ క్రమంలో డిగ్రీ, పీజీ పరీక్షలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags