Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE-Main to be conducted in more regional languages - Pokhriyal

 


JEE-Main to be conducted in more regional languages - Pokhriyal

ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 అనుగుణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వచ్చే ఏడాది నుంచి జేఈఈ (మెయిన్స్) పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) నిర్ణయించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం తెలిపారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

జేఈఈ మెయిన్స్ పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ భాషలో నిర్వహించే పరీక్ష ఆధారంగా రాష్ట్ర ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కల్పిస్తామన్నారు. జేఈఈ (మెయిన్స్) ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పించే రాష్ట్రాల స్టేట్ లాంగ్వేజ్‌‌ను కూడా దీనిలో చేర్చుతామని ప్రకటించారు. 

పీఐఎస్ఏ పరీక్షలో టాప్ స్కోరింగ్ కంట్రీస్ బోధనా మాధ్యమంగా మాతృ భాషను ఉపయోగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశ్నలను అవగాహన చేసుకుని మరింత మెరుగైన స్కోర్ సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

అదే సమయంలో ఇంగ్లిష్‌కు వ్యతిరేకం కాదని.. విద్యా బోధనా మాధ్యమంగా మాతృ భాష ఉంటే భారతీయ భాషలు బలోపేతమవడానికి దోహదపడుతుందన్నారు. ఏ రాష్ట్రంపైన కూడా మరే భాషను రుద్దాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. 22 భారతీయ భాషలను బలోపేతం చేయడానికి తాము సానుకూలంగా ఉన్నామన్నారు. ప్రాంతీయ భాషలన్నిటినీ సమానంగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags