Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Special trains for Dasara to Telugu states


 Special trains for Dasara to Telugu states

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. దసరాకు స్పెషల్ రైళ్లు, వివరాలివే

తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 30 మధ్య ఈ రైళ్లు నడవబోతున్నాయి. ప్రధానమైన, ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న రూట్లలో రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఆ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

దసరా పండగ రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా 392 స్పెషల్ రైళ్లు నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 30 మధ్య ఈ రైళ్లు నడవబోతున్నాయి. ప్రధానమైన, ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న రూట్లలో రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. నారాయణాద్రి, గౌతమి, శబరి, ఛార్మినార్‌, బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు నడవబోతున్నాయి. వీటిలో రోజు నడిచే రైళ్లతో పాటు వారానికి 2,3 రోజులు.. వారానికి ఓ సారి నడిచే రైళ్లున్నాయి. 

స్పెషల్ రైళ్లు మాత్రమే కాదు.. థర్డ్‌ ఏసీ బోగీలు అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 666 రైళ్లను (మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌లు)ను ప్రత్యేకంగా నడుపుతోంది. వీటికి అదనంగా 50 రోజుల పాటు పండగ ప్రత్యేక రైళ్లను నడుపుతారు. నవంబరు 30 తర్వాత నిలిచిపోతాయి. ప్రత్యేక రైళ్ల టిక్కెట్ ధరలే వీటికి కొనసాగుతాయి. అంటే ఆయా తరగతులను బట్టి సాధారణ రైళ్లతో పోలిస్తే 10-30% మేర ఎక్కువగా టికెట్‌ ధర ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే స్పెషల్ ట్రైయిన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిరోజు నడిచేవి.. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (విశాఖపట్నం-కడప), నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌-తిరుపతి), గౌతమి (లింగంపల్లి-కాకినాడ), నర్సాపూర్‌ (సికింద్రాబాద్‌-నర్సాపూర్‌), ఛార్మినార్‌ (హైదరాబాద్‌-చెన్నై), శబరి (సికింద్రాబాద్‌-త్రివేండ్రం), బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (కాచిగూడ-మైసూర్‌), హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ (హుబ్లీ-సికింద్రాబాద్‌ )

 

వారానికి 5 రోజులు: విశాఖపట్నం-విజయవాడ డబుల్‌ డెక్కర్‌ 

వారానికి 3 రోజులు: రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌-రాజ్‌కోట్‌) 

వారానికి 2 రోజులు: జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (హైదరాబాద్‌-జైపూర్‌) వయా నాందేడ్‌ 

వారానికి ఒక రోజు: గౌహతి ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌-గౌహతి) 

వారానికి 2 రోజులు: తిరుపతి-అమరావతి (మహారాష్ట్ర) 

వారానికి ఒక రోజు: భువనేశ్వర్‌-తిరుపతి (విజయవాడ మీదుగా) 

వారానికి ఒక రోజు: అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (విజయవాడ-హుబ్లీ) 

వీటితోపాటు తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags