Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Navodaya Vidyalaya Admission 2021-22: Application Form for Class 6th, Exam Dates, Eligibility, Pattern, Syllabus

 


Navodaya Vidyalaya Admission 2021-22: Application Form for Class 6th, Exam Dates, Eligibility, Pattern, Syllabus

నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం, ఎంపిక, అర్హతలు ఇవే..!

నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. 

జవహర్‌ నవోదయల్లో ఆరో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షలో ఎంపికైతే చాలు.. ప్లస్‌ 2 (ఇంటర్‌) వరకు ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం (2021-22) ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. 

ఈ జవహర్‌ నవోదయాలు దేశవ్యాప్తంగా 661 ఉన్నాయి. వీటిలో ఏపీలో 15 (2 కొత్తవి), తెలంగాణలో 9 ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. 2020-2021 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్నవారు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్టు (జేఎన్‌వీఎస్‌టీ) రాసుకోవచ్చు. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. 

గ్రామీణ విద్యార్థులకు 75 శాతం:

75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులతో భర్తీ చేస్తారు. గ్రామీణ ప్రాంత కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో లేదా గుర్తింపు పొందిన ఇతర స్కూళ్లలో చదవివుండాలి. మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలవారికి అవకాశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు ఉంటాయి. దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు. 

ఉన్నతమైన బోధన:

ఈ పరీక్షలో ఎంపికైన వాళ్లు ఆరో తరగతి నుంచి +2 వరకు ఉచితంగా చదువుతోపాటు వసతి, భోజనం పొందవచ్చు. మిగిలినవారు తొమ్మిదో తరగతి నుంచి నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. ఉన్నత బోధన ప్రమాణాలు నవోదయ విద్యాలయాల సొంతం. ఎనిమిదో తరగతి వరకు మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అభ్యసించవచ్చు. తొమ్మిది నుంచి ఆంగ్ల మాధ్యమం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. ఇక్కడ రెగ్యులర్‌ చదువతోపాటు నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. 

ముఖ్య సమాచారం:

అర్హత: 2020-2021 విద్యా సంవత్సరంతో 5వ తరగతి చదువుతున్న వారు అర్హలు.

వయసు: మే 1, 2008 - ఏప్రిల్‌ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: డిసెంబరు 15, 2020

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 10, 2021

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in 

ఆరో తరగతి అడ్మిషన్లు 2020-21

పరీక్ష విధానం:

ఈ నవోదయ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌.. ఇలా విద్యార్థి కోరుకున్న మీడియంలో పరీక్ష రాసుకోవచ్చు. మొత్తం 100 మార్కులకు జరిగే ఈ పరీక్షలో.. మూడు సెక్షన్లలలో కలిపి 80 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్‌ మార్కులు లేవు.

సెక్షన్‌-1: మెంటల్‌ ఎబిలిటీ. ఇందులో 40 ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక గంట సమయం కేటాయించారు. ఈ విభాగపు పరీక్షలో చిత్రాలు, రేఖలు, బొమ్మలపై ప్రశ్నలు వస్తాయి. ఈ సెక్షన్‌లో 10 భాగాలుంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల్లో కొన్ని బొమ్మలు ఇచ్చి వాటిలో భిన్నమైనది గుర్తించమనడం, ఒక అసంపూర్ణ చిత్రం లేదా గ్రాఫ్‌ ఇచ్చి అది సంపూర్ణం కావడానికి ఇచ్చిన ఆప్షన్లలో ఏది సరిపోతుందో పోల్చమనడం, చిత్రాలు/ బొమ్మల క్రమాన్ని ఇచ్చి తర్వాత వచ్చే దాన్ని గుర్తించమనడం.. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. 

సెక్షన్‌ -2: అర్థ‌మెటిక్‌లో 20 ప్రశ్నలు వస్తాయి. 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. అర్థమెటిక్‌‌ పరీక్షలో అంకెలు, కసాగు, గసాభా, వడ్డీలు, దత్తాంశాలు, భిన్నాలు, లాభనష్టాలు, నాలుగంకెల్లో ఉండే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు వంటి ప్రశ్నలుంటాయి.

సెక్షన్‌-3: లాంగ్వేజ్‌ టెస్ట్‌లో 20 ప్రశ్నలు. పరీక్ష వ్యవధి అర గంట. లాంగ్వేజ్‌ టెస్టులో పాసేజ్‌ ఇచ్చి, ప్రశ్నలకు సమాధానం రాయమంటారు. విద్యార్థులు పాసేజ్‌ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్‌ కింద అయిదేసి ప్రశ్నల చొప్పున నాలుగు పాసేజ్‌లు ఉంటాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags