Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 23-12-2020

 

AP Covid-19 Media Bulletin 23-12-2020

ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 57,716 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 8,79,718కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,085కి చేరింది. ఒక్కరోజులో 490 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 3,864 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,14,15,246 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags