Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New wage rule may raise India Inc's costs from April

 

New wage rule may raise India Inc's costs from April 

ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతన చట్టం అమలు

మీరు జాబ్ చేస్తు్న్నారా? అది కూడా ప్రైవేట్ ఉద్యోగమనా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ అమలులోకి వస్తోంది. దీంతో ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. జీతం తగ్గకపోయినా కూడా చేతికి మాత్రం తక్కువ వేతనం అందుతుంది. 

కొత్త వేతన నిబంధనల కారణంగా కంపెనీలు వాటి వేతన ప్యాకేజీలను సవరించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగుల చేతికి వచ్చే వేతనం తగ్గనుంది. వేజ్ కోడ్‌లోని కొత్త కంపెన్సేషన్ రూల్స్‌కు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇవి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి. అంటే ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. 

కొత్త రూల్స్ ప్రకారం.. టోటల్ కంపెన్సేషన్‌లో అలవెన్స్‌లు అనేవి 50 శాతానికి పైగా ఉండకూడదు. అంటే బేసిక్ పే ఏప్రిల్ 1 నుంచి 50 శాతం లేదా ఆపైన ఉండాలి. సాధారణంగా చాలా కంపెనీలు వాటి ఉద్యోగుల వేతన ప్యాకేజీలో నాన్ అలవెన్స్‌ను 50 శాతం కన్నా తక్కువగానే ఉంచుతాయి. దీంతో కొత్త రూల్స్ వల్ల చాలా మంది ఉద్యోగుల వేతనంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. 

కంపెనీలు కొత్త రూల్స్‌ను ఫాలో అవ్వాలంటే కచ్చితంగా ఉద్యోగుల బేసిక్ వేతనాన్ని పెంచాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగుల టేకోమ్ శాలరీపై ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే చాలా మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ PF కంట్రిబ్యూషన్‌ కూడా ఎక్కువ కట్ అవుతుంది. బేసిక్ వేతనం ప్రాతిపదికన పీఎఫ్ కంట్రిబ్యూషన్ కట్ అవుతుందనే విషయం మనకు తెలిసిందే. 

అయితే ఇక్కడ దీని వల్ల ఉద్యోగులుపై ఎఫెక్ట్ పడినా కూడా దీర్ఘకాలంలో వీరికి మంచే జరుగుతుంది. పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఎక్కువ కట్ కావడం వల్ల రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ డబ్బులు చేతికి వస్తాయి. అంతేకాకుండా గ్రాట్యుటీ కూడా బేసిక్ పే ప్రాతిపదికనే చెల్లిస్తారు. దీంతో గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags