Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 03-04-2021

 

TS Covid-19 Media Bulletin 03-04-2021

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా - తాజాగా 1,078 మందికి పాజిటివ్‌

తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవ్వడమే ఇందుకు నిదర్శనం. కాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7000లకు చేరువైంది. శుక్రవారం 59,705 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,078 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 6,900గా ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుల చేసింది.

తాజాగా కరోనాతో ఆరుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1712కి చేరింది. నిన్న 330 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 283 కరోనా కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ కరోనా తీవ్రత అధికంగానే కనిపిస్తోంది. నిజామాబాద్‌లో 75, నిర్మల్‌లో 40 , కరీంనగర్‌లో 34 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.



Previous
Next Post »
0 Komentar

Google Tags