Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 15-05-2021

 


AP Covid-19 Media Bulletin 15-05-2021

ఏపీలో కొత్తగా 22,517  కరోనా కేసులు

ఏపీలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 89,535 నమూనాలను పరీక్షించగా, 22,517 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 14,11,320 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,78,80,755 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 

కొవిడ్‌తో బాధపడుతూ గత 24 గంటల్లో అనంతపురంలో 12 మంది మృతి చెందగా, నెల్లూరులో 11, తూర్పుగోదావరి 10, విశాఖ 9, విజయనగరం 9, చిత్తూరు 8, శ్రీకాకుళం 8, గుంటూరు 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, కర్నూలు 5, ప్రకాశం 5, కడప ఇద్దరు మృత్యువాతపడ్డారు.  తాజాగా 18,739 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 11,94,582 మంది కరోనా నుంచి బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 3383 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 992 మంది కరోనా బారిన పడ్డారు.

AP BULLETIN 15-05-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags