Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో ఈనెల 21 నుంచి 30 వరకు కర్ఫ్యూ వేళల సడలింపు

 

ఏపీలో ఈనెల 21 నుంచి 30 వరకు కర్ఫ్యూ వేళల సడలింపు

రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను ఏపీ ప్రభుత్వం సడలించింది. కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సడలింపులు ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండగా.. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పెంచారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

రాష్ట్రంలో దుకాణాలు మాత్రం సాయంత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. కర్ఫ్యూ సడలింపులతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. సడలించిన వేళలు ఈనెల 21 నుంచి 30 వరకు అమల్లో ఉండనున్నాయి. తూర్పుగోదావరిలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ఆ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు కొనసాగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

HM& FW Department – Extension of curfew up to 30.06.2021 with modified timings from 6.00 PM to 6.00 AM with effect from 21.06.2021 in the State except East Godavari District - Continuation of existing curfew timings i.e., 2.00 PM to 6.00 AM in East Godavari District up to 30.06.2021 - Orders – Issued.

G.O.RT.No. 311 Dated: 20-06-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags