Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Board Exams: Education Minister to Interact with Students Today

 

CBSE Board Exams: Education Minister to Interact with Students Today

సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలు: ఈ రోజు విద్యార్థులతో విద్యా మంత్రి రమేశ్ పోఖియాల్ సోషల్ మీడియా ద్వారా ముఖాముఖి 

కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖియాల్ నిశాంక్ శుక్రవారం విద్యార్థులతో సోషల్ మీడియా ద్వారా ముఖాముఖి సమావేశం కానున్నారు. పది, 12వ తరగతులకు సంబంధించి విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతారు.

కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడంతో విద్యార్థుల్లో చాలా అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేయడానికి కేంద్రమంత్రి విద్యార్థులతో ముఖాముఖికి అంగీకరించారు.

అనేక ప్రశ్నలు, సందేహాలతో విద్యార్థులు తనకు మెసేజ్ లు పెడుతున్నారని నిశాంక్ తెలిపారు.

' ప్రియమైన విద్యార్థులారా ! మీ నుంచి నాకు చాలా మెసేజ్ లు, సమాచారం అందింది. నా ఆర్యోగం గురించి కూడా ఆందోళనలు వ్యక్తంచేశారు.

ఇందుకుగాను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నాను ' అని నిశాంక్ చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags