Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights – 20/05/2025

 

AP Cabinet Meeting Highlights – 20/05/2025

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 20/05/2025

===================

Cabinet Decisions - Press Briefing by Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public Relations, Housing and Sri. Nadendla Manohar, Food and Civil Supplies, Consumer Affairs at Publicity Cell, Block - 04, AP Secretariat on 20-05-2025 LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి మంత్రుల ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=o2_mEsXsnis

=================== 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ లో వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే:

> సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. త్వరలోనే విద్యుత్ ఇంధన వనరుల కేంద్రంగా మారనున్న అనంతపురం.

> వివిధ పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం - టూరిజం పాలసీకి అనుగుణంగానే వీరికి ప్రోత్సాహకాలు.

> డైకిన్ ఏసీ తయారీ సంస్థకు శ్రీసిటీలో విస్తరణకు అనుమతి.

> ప్రాజెక్టు వయబిలిటి దృష్టిలో ఉంచుకొని తిరిగి 500 ఎకరాలు కేటాయింపు.

> అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. 20 శాతం సీట్లు ఏపీ విద్యార్థులకు కేటాయించేలా రిజర్వేషన్.

> అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరు వద్ద ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం.

> పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం.

> 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకం కోసం చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

> ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 22ఏ నిషేధ జాబితాలోని ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుతో పాటు ఫీజు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం.

> కడప జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ కి 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్.

> సత్యసాయి జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు భూ కేటాయింపు చేసేందుకు ఆమోదం.

> నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 615 ఎకరాల భూమి పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా బదలాయించేందుకు అంగీకారం.

> రాజకీయ కక్షతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.

> చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి కొన్ని మండలాలు అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు కేబినెట్ ఆమోదం.

> అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజక్టు కోసం ఐబీఎం, టీసీఎస్లతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం.

> రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు ఏపీ మోటారు వాహనాల చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags