Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Who Invented the ATM Machine & What is the reason for ATM idea?

 

Who Invented the ATM Machine & What is the reason for ATM idea?

ఏటీఎం మెషీన్‌ను ఎవరు కనుగొన్నారు, అతను భారతదేశంలో జన్మించాడని మీకు తెలుసా & ఏటీఎం ఆలోచనకు కారణం ఏమిటి?

===================

ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) మన రోజువారీ జీవితాల్లో భాగమైపోయింది. డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిన ఈ కాలంలోనూ.. ఇవి లేని రోజుల్ని ఊహించడం కష్టం. అలాంటి ఈ మెషీన్ రూపొందించాలన్న ఆలోచన ఎలా పురుడుపోసుకుందన్నదీ ఆసక్తికరమే.

1967లో లండన్ లో తొలి ఏటీఎం ఏర్పాటైంది. బార్ క్లేస్ బ్యాంక్ బ్రాంచ్ బయట దీన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ టీవీ నటుడు రెగ్ వార్నీ అప్పట్లో ప్రారంభించారు. తొలినాళ్లలో ఈ ఏటీఎం నుంచి గరిష్ఠంగా 10 పౌండ్లు మాత్రమే ఉపసంహరించుకోవడానికి వీలుండేది. క్యూలో గంటలు గంటలు నిల్చుని బ్యాంకులో నగదు ఉపసంహరించుకోవడంతో పోలిస్తే ఇది పెద్ద మొత్తమనే చెప్పాలి.

జాన్ షెఫర్డ్ బారన్ అనే వ్యక్తి ఈ ఏటీఎంను రూపొందించారు. లండన్ లోని ఓ బ్యాంకు వద్ద నగదు కోసం ప్రజలు పోటీపడడాన్ని షెఫర్డ్ గమనించారు. నగదు అవసరమైనప్పుడు తాను వ్యక్తిగతంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. తన స్వీయ అనుభవం బ్యాంకు గంటలకు మించి నగదును అందుబాటులో ఉంచే యంత్రం గురించి ఆలోచించేలా చేసింది. ఈ క్రమంలో చాక్లెట్ బార్లను విక్రయించే వెండింగ్ మెషీన్ ఆయనకు గుర్తొకొచ్చింది. చాక్లెట్ల స్థానంలో నగదు ఎందుకు ఉండకూడదన్న ఆలోచన చేశారు. ఈ ఆలోచనతో 24/7 నగదు ఉపసంహరణకు అనుమతించే ఒక యంత్రాన్ని రూపొందించారు. అలా రూపుదిద్దుకున్న క్యాష్ మెషీనే.. నేడు ఏటీఎంగా మారింది.

ఇంకో విషయం ఏంటటే స్కాట్లాండ్ కు  చెందిన జాన్ షెఫర్డ్ బారన్ పుట్టింది భారత్లోనే. ఆయన తల్లిదండ్రులు బ్రిటిషర్లు. ఉద్యోగరీత్యా ఆయన తండ్రి బ్రిటిష్ ఇండియాలో విధులు నిర్వర్తించారు. 1925 జూన్ 23న నేటి మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో షెఫర్డ్ జన్మించారు. ఆయన జ్ఞాపకార్థం ఆస్పత్రి వెలుపల 2021 ఆగస్టులో ఎస్బీఐ ఓ ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

భారత్లో ఏటీఎం ప్రస్థానం 1987లో ప్రారంభమైంది. ముంబయిలో హెచ్ఎస్ బీసీ బ్యాంకు శాఖలో తొలి ఏటీఎం ఏర్పాటైంది. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ఇక్కడే ప్రారంభమైంది. తర్వాతి కాలంలో దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించాయి. 1999 నాటికి దేశంలో కేవలం 800 ఏటీఎంలు ఉండగా.. 2024 నాటికి ఆ సంఖ్య 2 లక్షల పైమాటే తొలినాళ్లలో కేవలం నగదు విశ్రాకు మాత్రమే పనికొచ్చిన ఈ ఏటీఎంలు అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, స్టేట్మెంట్, పిన్ జనరేషన్, కార్డు లెస్ విత్ వంటి సేవలను అందిస్తున్నాయి.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags