SBI Foundation Platinum Jubilee Asha
Scholarship 2025 – Details Here
ఎస్బీఐ ఫౌండేషన్
ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025 – పూర్తి వివరాలు ఇవే
==================
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రతిభ కలిగి ఆర్థిక ఇబ్బందులున్న విద్యార్థులకు
స్కాలర్ షిప్ అందిస్తోంది. ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్ షిప్ పేరుతో
ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 9వ
తరగతి నుంచి పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 నుంచి 20 లక్షల వరకు స్కాలర్ షిప్ గా అందిస్తారు.
ఎస్బీఐ ఫౌండేషన్
ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025:
అర్హతలు: 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు; డిగ్రీ, పీజీ, మెడికల్, ఐఐటీ, ఐఐఎంలో
చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్షిప్ నకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ.3లక్షలు/రూ.6లక్షలు మించకూడదు.
ఏటా అందే
స్కాలర్షిప్:
> 9 వ తరగతి
నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న
విద్యార్థులకు రూ.15,000.
> అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.75,000.
> పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.2,50,000.
> మెడికల్ విద్యార్థులకు రూ.4,50,000.
> ఐఐటీ విద్యార్థులకు రూ.2 లక్షలు.
> ఐఐఎం (ఎంబీఏ/ పీజీడీఎం) విద్యార్థులకు రూ.5 లక్షలు.
> ఓవర్సీస్
లో చదివే విద్యార్థులకు రూ.20 లక్షలు.
ఎంపిక
ప్రక్రియ: అకడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితి
ఆధారంగా ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. వచ్చిన దరఖాస్తులను అర్హతల ఆధారంగా
షార్టిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. షార్టిస్ట్ చేసిన
అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు
ఖాతాల్లోకి నేరుగా స్కాలర్షిప్ మొత్తాన్ని జమ చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2025.
==================
==================



0 Komentar