Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAMCET-2020 Results Released


 AP EAMCET-2020 Results Released

ఏపీ ఎంసెట్‌ పరీక్షల ఫలితాలు విడుదల
  
రాష్ట్రంలో ఇంజనీరింగ్అగ్రికల్చర్ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్‌ 2020 పరీక్షలు Sep 25 తో ముగిశాయి. ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయంమధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి.

మొత్తం 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా.. 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రిమెడికల్‌ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి సమాధానాల ప్రాథమిక కీ Sep 26 నా విడుదల చేశారు. క్రిందటి నెల 28 వరకు అభ్యంతరాలను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఏపీ ఎంసెట్ ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు. 


Previous
Next Post »
0 Komentar

Google Tags