Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APS: 8000 Teacher Posts - Qualifications, Selection Process, Exam Procedure, Success Tips.

 

APS: 8000 Teacher Posts - Qualifications, Selection Process, Exam Procedure, Success Tips

ఏ‌పి‌ఎస్: 8000 టీచర్‌ పోస్టులు.. అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సక్సెస్‌ టిప్స్‌ ఇవే..!

ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యుఈఎస్‌) ఆధ్వర్యంలో ఈ ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లు నడుస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో సుమారు 8000 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యుఈఎస్‌) ఆధ్వర్యంలో ఈ ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లు నడుస్తున్నాయి. ఇక్కడ సీబీఎస్‌ఈ బోధన ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్టులో సాధించిన స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఈ లోగా సంబంధిత ఆర్మీ స్కూళ్లు ప్రకటనలు విడుదల చేసినప్పుడు ఆ స్కోరుతో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్య సమాచారం:

ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఆర్మీ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న దాదాపు 8000 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ) పోస్టులు ఉన్నాయి. 

అర్హతలు:

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): ఇంగ్లిష్, హిందీ, జాగ్రఫీ, ఎకనమిక్స్, పాలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మాటిక్స్, హోమ్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర ఖాళీలున్నాయి.

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో పీజీ, బీఎడ్ కలిగి ఉండాలి.

2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, హిస్టరీ,జాగ్రఫీ,పొలిటికల్ సైన్స్‌, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర ఖాళీలున్నాయి.

విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్ పూర్తిచేసి ఉండాలి.

3. పైమరీ టీచర్ (పీఆర్‌టీ): ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీతోపాటు బీఎడ్/ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా/నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.

వయసు: 01.04.2021 నాటికి 40 ఏళ్లకు మించకూడదు. బోధనలో ఐదేళ్ల అనుభవం కలిగి ఉంటే 57 ఏళ్లలోపు వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 20, 2020

స్క్రీనింగ్‌ పరీక్ష తేదీలు: 2020, నవంబర్ 21, 22 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ.

ఫలితాల వెల్లడి: 02 డిసెంబర్ 2020 (తేదీలో మార్పులు ఉండొచ్చు)

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://aps-csb.in/

APS NOTIFICATION

ఎంపిక విధానం:

ఆర్మీ స్కూల్ టీచర్ పోస్టుల దరఖాస్తు చేసి, స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారు.. ఆయా ఆర్మీ స్కూల్స్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు విడిగా దరఖాస్తు చేసుకొని.. తదుపరి ఎంపిక ప్రక్రియకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీని పరీక్షించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ-సీటెట్)/స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఈటీ-టెట్) తప్పనిసరి కాదు. కానీ టీజీటీ/పీఆర్‌టీ పోస్టుల నియామకానికి మాత్రం సీటెట్/టెట్ తప్పనిసరిగా ఉండాలి.

స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

ఉపాధ్యాయ పోస్టులు

గమనిక:

పరీక్షపై అవగాహన నిమిత్తం మాక్‌ టెస్టును నిర్వహిస్తారు. నవంబరు 4 నుంచి ఆసక్తి ఉన్నవారు రాసుకోవచ్చు. నవంబరు 13 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే మాదిరి ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అయితే వీటిని కావాల్సినవారు పార్ట్‌-ఏకు రూ.50, పార్ట్‌-బికు రూ.50 చెల్లించి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

పీజీటీ-టీజీటీ స్క్రీనింగ్ టెస్ట్:

ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్‌ను 180 మార్కులకు రెండు విభాగాలుగా(పార్ట్-ఏ,బీ) నిర్వహిస్తారు. పార్ట్-ఏ-90 మార్కులకు, పార్ట్-బీ-90 మార్కులకు ఉంటుంది. పార్ట్-ఎలో జనరల్ అవేర్‌నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్‌, కాంప్రహెన్షన్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్‌లు, మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. అలాగే పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు(180 నిమిషాలు).

పీఆర్‌టీ స్క్రీనింగ్ టెస్ట్:

ఈ పరీక్ష పార్ట్-ఏగా మొత్తం 90 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-ఏలో జనరల్ అవేర్‌నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, కాంప్రహెన్షన్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్‌లు, మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి గంటన్నర(90 నిమిషాలు). ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు (1/4) కోత విధిస్తారు. 

ఇంటర్వ్యూ:

స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులను వారు దరఖాస్తు చేసుకున్న స్కూల్ నుంచి మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన వారికి టీచింగ్ నైపుణ్యాలను, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరిశీలించి పోస్టులను కేటాయిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags