Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

India successfully test fires anti-radiation missile 'Rudram'

 

India successfully test fires anti-radiation missile 'Rudram'

యాంటీ రేడియేషన్ క్షిపణి ‘రుద్రమ్’.. విజయవంతంగా పరీక్షించిన భారత్

సరిహద్దుల్లో ఓవైపు పాకిస్థాన్.. మరోవైపు చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. తాజాగా, అత్యాధునిక యాంటీ-రేడియేషన్ క్షిపణిని భారత్ పరీక్షించింది. 

పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ రేడియేషన్ క్షిపణి‘రుద్రమ్’ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. శత్రువుల నిఘా, రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసే సామర్థ్యంతో రూపొందించిన ఈ క్షిపణిని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించింది. కొత్త తరం యాంటీ-రేడియేషన్ క్షిపణి రుద్రం-1.. కాల్పులు జరిపిన ఎత్తును బట్టి 100- 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా చేధించింది. ధ్వని కంటే రెండు రెట్లు వేగంతో ప్రయాణించే ఈ క్షిపణిని శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఒడిశా తీరంలో బాలసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించారు. 

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అత్యాధునిక ఆయుధాలను పరీక్షించుకుంటోంది. గత కొన్ని నెలలుగా ఆయుధ పరీక్షలు నిర్వహిస్తున్న రక్షణ శాఖ తాజాగా యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం-1 విజయవంతంగా పరీక్షించింది. రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఈ క్షిపణిని రూపొందించింది. 

ఐఎన్ఎస్-జీపీఎస్ నావిగేషన్ ఉన్న రుద్రమ్.. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో తాకింది అని డీఆర్డీఓకు చెందిన ఓ సైంటిస్ట్ వ్యాఖ్యానించారు. ‘రుద్రమ్-1 ప్రత్యర్థుల గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.. రేడియో తరంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న శత్రువుల రాడార్లను గుర్తించి వాటిని స్తంభింపజేసే సామర్థ్యం దీని సొంతం.. శత్రు దేశాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థల సంబంధాలను తెంచివేయగలదు’ అని అన్నారు. 

భారత వాయుసేన పాటవాన్ని రుద్రమ్ క్షిపణి మరింత ఇనుమడింప చేస్తుందనడంలో సందేహంలేదు. ప్రస్తుతం దీన్ని సుఖోయ్-30 ఎంకేఐ విమానం నుంచి మాత్రమే ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో మిరేజ్-2000, జాగ్వార్, తేజస్, తేజస్ మార్క్-2 యుద్ధ విమానాలతో అనుసంధానం చేయనున్నారు. తొలిసారిగా గాలిలో నుంచి భూమిపైకి ప్రయోగించే క్షిపణిని డీఆర్డీఓ రూపొందించింది. దీని పరిధి 100 నుంచి 150 కిలోమీటర్లు.

Previous
Next Post »
0 Komentar

Google Tags