Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Extension of Inter Admissions Deadline


TS: Extension of Inter Admissions Deadline
ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే..!
రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రవేశాల గడువును పొడిగించారు.

రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు గతంలో సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువుగా నిర్ణయించారు. తాజాగా ప్రవేశాల గడువును అక్టోబ‌రు 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు ఇంటర్‌బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌ 16 మొదటి విడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.
సెప్టెంబర్‌ 18న ఆన్‌లైన్‌ తరగతుల ప్రారంభం ఉంటుంది.
సెప్టెంబర్‌ 30 ప్రవేశాలకు తుది గడువు.
ఈ గడువును ప్రస్తుతం అక్టోబర్‌ 20 వరకు పొడిగించారు.
ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్‌ కోటా 10 శాతం అమలు చేయనున్నట్టు ప్రకటించింది.
ఇంటర్‌ మార్కుల మెమోల ఆధారంగా ప్రవేశాలు చేయవచ్చని.. అమల్లో ఉన్న రిజర్వేషన్ల నియమాన్ని పాటించాలని ఆయా ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.
గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో https://tsbie.cgg.gov.in/ లేదా http://acadtsbie.cgg.gov.in/ ఉంచారు.
ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రతి సెక్షన్‌లో 88 మంది కంటే ప్రవేశాలు మించరాదు.
బోర్డు మంజూరు చేసిన సెక్షన్లు.. నిండిన సీట్లు తదితర వివరాలను కాలేజీ మెయిన్‌ గేట్‌ వద్ద అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి.
Previous
Next Post »
0 Komentar

Google Tags