Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు - పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీస్‌ కుదింపు

 

తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు - పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీస్‌ కుదింపు

తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో తీపికబురు అందించారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్‌.. తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. 

అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడతామని సీఎం కేసీఆర్‌ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వోద్యోగులూ కలిసి 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు; తక్కువ వేతనాలున్న ఆర్టీసీ సిబ్బందికి; ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు; గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌, వర్క్‌ఛార్జ్‌డ్‌ ఉద్యోగులకు; దినవేతన, పూర్తిస్థాయి కాంటింజెంట్‌, పార్ట్‌టైం కాంటింజెంట్‌, సెర్ప్‌ ఉద్యోగులకు పెంపు వర్తిస్తుందని చెప్పారు. హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్ల మాదిరి గౌరవ వేతనాలు అందుకుంటున్న వారందరికీ, పెన్షనర్లకు... ఇలా అందరికీ పెంపుదల ప్రయోజనం ఉంటుందన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags