Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Pariksha Pe Charcha 2021: Classes 9-12 can apply till March 14

 

Pariksha Pe Charcha 2021: Classes 9-12 can apply till March 14

పరీక్షా పే చర్చ’ న‌మోదు గ‌డువు మార్చి 14 - ఈసారి ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హ‌ణ‌  

విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు 

విద్యార్థుల్లో పరీక్షలపై ఒత్తిడి, భయం పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం వచ్చే నెలలో జరగనుంది. అయితే కొవిడ్‌ వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఈ సమావేశం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

మన ధైర్యవంతమైన ఎగ్జామ్‌ వారియర్లు పరీక్షలు సన్నద్ధమవుతున్న వేళ పరీక్షా పే చర్చ 2021 వచ్చేసింది. ఈసారి పూర్తిగా ఆన్‌లైన్‌ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులందరినీ ఆహ్వానిస్తున్నా. రండి.. ఎలాంటి ఒత్తిడి లేకుండా చిరునవ్వుతో పరీక్షలకు హాజరవుదాం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. అంతేగాక, ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చ’లో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరుకావాలని ప్రధాని కోరారు.   

ఈ చర్చలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు ఫిబ్ర‌వ‌రి 18 నుంచి మార్చి 14 వరకు నమోదు చేసుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. 2018 నుంచి ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులతో మోదీ సమావేశమై వారిలో ఒత్తిడిని పోగొట్టేలా ప్రసంగిస్తారు. వారి సందేహాలు నివృత్తి చేస్తుంటారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags