Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఈసారీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రెండున్నర లక్షల మందికే అనుమతి

 

ఈసారీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రెండున్నర లక్షల మందికే అనుమతి 

వచ్చే విద్యా సంవత్సరం (2021-22) ఐఐటీల్లో ప్రవేశానికి జులై 3న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2021 రాసేందుకు రెండున్నర లక్షల మంది విద్యార్థులనే అనుమతించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు నిర్ణయించి వారిని మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నారు. ఆ సంఖ్యను కొన్నేళ్లుగా పెంచుతూ వస్తున్నారు. 2018లో 2.30 లక్షలు, 2019లో 2.45 లక్షలు, 2020లో 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రకారం ఈసారి మరికొంత పెరగవచ్చని నిపుణులు అంచనా వేయగా.. 2021కి పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌ తాజాగా అదే సంఖ్యను ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు 40వేల మంది వరకు అర్హత సాధిస్తున్నారు. గత ఏడాది 2.50 లక్షల మందికి అవకాశం ఇచ్చినా పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసింది 1,60,838 మందే. అందుకే ఈసారి విద్యార్థుల సంఖ్యను పెంచకపోయి ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

4 దేశాల్లో పరీక్షా కేంద్రాలు

ఈసారి భారత్‌తోపాటు దుబాయ్‌(యూఏఈ), ఢాకా(బంగ్లాదేశ్‌), కఠమాండూ(నేపాల్‌), సింగపూర్‌లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ బుధవారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

IIT KHARAGPUR WEBSITE 

JEE ADVANCED - 2021 WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags