Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Pension System: Now, you can exit NPS via online mode

 

National Pension System: Now, you can exit NPS via online mode

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్‌లో కొత్త సర్వీసులు అందుబాటులోకి!

 

మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్‌స్క్రైబరా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఈ స్కీమ్‌లో చేరిన వారు ఆన్‌లైన్‌లోనే స్కీమ్ నుంచి బయటకు రావొచ్చు. 

పీఎఫ్‌ఆర్డీఏ కొత్త సేవలు

ఆన్‌లైన్‌లోనే ఆ పని పూర్తి 

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరిన వారికి శుభవార్త అందింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ PFRDA కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారు ఇకపై ఆన్‌లైన్‌లోనే స్కీమ్ నుంచి బయటకు వచ్చేయవచ్చు. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు సెంట్రల రికార్డ్ కీపింగ్ ఏజన్సీ CRA సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వాలి. ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వొచ్చు. ఇదివరకు సబ్‌స్క్రైబర్లు ఎన్‌పీసీ సెంటర్‌కు వెళ్లి స్కీమ్ నుంచి వైదొలగాల్సి ఉండేది. 

సబ్‌స్క్రైబర్లు ఆన్‌లైన్‌లో ఓటీపీ లేదా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ద్వారా ఎన్‌పీఎస్ నుంచి బయటకు రావొచ్చు. దీని కోసం సబ్‌స్క్రైబర్లు పీఓపీ (పాయింట్ ఫ్ ప్రిసెన్స్)కు వెళ్లాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లోనే ఎగ్జిట్ రిక్వెస్ట్ పెడితే సరిపోతుంది. కేవైసీ, విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్ వంటి వాటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 

మీరు ఆన్‌లైన్‌లోనే ఎన్‌పీఎస్ స్కీమ్ నుంచి వైదొలగాలని భావిస్తే రిక్వెస్ట్ పెట్టుకుంటే రూ.125 నుంచి రూ.500 వరకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే ఈ పని పూర్తి చేసుకోవచ్చు. కరోనా వైరస్ సమయంలో ఇది మంది ఫెసిలిటీ అని చెప్పుకోవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags