Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ముగిసిన ట్రిపుల్ ఐటీల కౌన్సెలింగ్ - ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభం

 

ముగిసిన ట్రిపుల్ ఐటీల కౌన్సెలింగ్ - ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభం

రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు చెందిన ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం రాత్రి ముగిసింది. నాలుగు ట్రిపుల్ ఐటీలలో కలిపి 4,400 సీట్ల భర్తీకి ఈ నెల 4వ తేదీన కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ప్రత్యేక కేటగిరి సీట్లు 273 మినహాయించగా మిగిలిన 4,127 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ముగిసే సరికి శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎస్టీ కేటగిరీకి చెందిన 9సీట్లు మిగిలినట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్ వీ గోపాలరాజు తెలిపారు. వీటిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 7 సీట్లు ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 2 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను ప్రత్యేక కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో భర్తీ చేస్తామన్నారు.

పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు 18వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని గోపాలరాజు తెలిపారు.

Previous
Next Post »

1 comment

  1. When will release the the spacial category selected list

    ReplyDelete

Google Tags